17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేడు హనుమకొండలో ఓసీ సింహగర్జన

11-01-2026 12:21 AM

సభ స్థలిని పరిశీలించిన వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ మహేష్‌బాబు 

హనుమకొండ టౌన్, జనవరి 10 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహిస్తున్న ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లను వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ గట్టు మహేష్ బాబు శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాల్లో పేదలకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యానికి వ్యతిరేకంగా హక్కుల సాధనకై పిలుపునిచ్చిన ఓసిల సింహగర్జన సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, మార్వాడి, కమ్మ, వెలమ సోదరులకు భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను అలాగే వెహికల్ పార్కింగ్ అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయడం వంటివి పరిశీలించారు.