24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

థార్ గ్యాంగ్ ముఠా సభ్యుడి అరెస్ట్

11-01-2026 12:18 AM

60 తులాల బంగారం స్వాధీనం

నల్లగొండ క్రైం, జనవరి 10: బస్సులలో బంగారు ఆభరణాలను దొంగలించే అంతరాష్ట్ర థార్ గ్యాంగ్ ముఠా సభ్యుడిని అరెస్టు చేసి, 6o తులాల బంగారాన్ని నల్లగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా ధర్మపురి తాలూ కా ఖల్ఘాట్ గ్రామానికి చెందిన షా అల్లా రఖా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దోపిడీలకు పాల్పడుతున్నాడు.

డిసెంబర్ 5న చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో భారీ మొత్తం లో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి పాల్పడిన ది థార్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలలో గాలిం చి, మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అత డు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి చోరీ చేసినట్టుగా అంగీకరించాడు. గతంలో ఈ ముఠా 2022, 2023 సంవత్సరంలో విజయవాడ హైవేపై హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సు నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దొంగలించా రు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.