calender_icon.png 30 May, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగిన వాగు.. యువకుడి గల్లంతు

29-05-2025 03:28:06 AM

- ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

- మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరువాన

అదిలాబాద్/మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఓ యువకుడు వరద ఉధృతికి వాగులో గల్లంతైన ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం తాత్కాలిక బ్రిడ్జి పైనుంచి వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని లక్ష్మీ పూర్‌నే చెందిన లాండ్గే దత్తు అనే యువకు డు ద్విచక్ర వాహనంపై మంగళవారం రాత్రి స్వగ్రామానికి వెళ్తున్నాడు.

తాత్కాలిక వంతెన పైకి చేరుకోగా వరద ఉధృతికి ద్వి చక్ర వాహనంతో పాటు వాగులో కొట్టుకుపోయాడు. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాహనం లభ్యమైనప్పటికీ, దత్తు జా డ దొరకలేదు. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో గార్ల మిన హా మిగిలిన అన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 8.55 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యిం ది. భారీ వర్షానికి పలుచోట్ల వాగులు, వంక లు పొంగిపొర్లుతున్నాయి. కొత్తగూడ మండలంలో వరదకు డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవ డంతో ఏజెన్సీలోని ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.