calender_icon.png 30 May, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలసదన్‌లో మిస్ వరల్డ్ పోటీదారులు

29-05-2025 03:24:25 AM

- పిల్లలతో డ్యాన్సులు చేస్తూ ఉల్లాసంగా గడిపిన అందగత్తెలు

- ఒక్కో చిన్నారికి రూ.25 వేల కిట్లు

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని హోటల్ ట్రిడెంట్ వేదికగా మిస్ వరల్డ్ పోటీదారులతో బుధవారం హార్ట్ ఆఫ్ గోల్డ్ పేరిట ఓ వినూత్నమైన చారిటీ ఈవెంట్‌ను నిర్వహించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీస్ బాలసదన్‌లలోని అనాథ చిన్నారులు పాల్గొన్నారు.

మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో కలిసి ఆడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. 200 విద్యార్థులకు ఏడాది పాటు సహకారం ఇస్తామన్నారు. రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ , సుదీక్ష ఎస్టేట్స్ సంస్థలు మిస్ వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్‌లోని 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించాయి.

రూ.25 వేల కిట్లను అందజేశారు. విక్టోరియా మెమోరియల్ పాఠశాల పూర్తిస్థాయి పునరుద్ధరణను కూడా దాతలు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లే పాల్గొన్నారు.