03-06-2025 01:01:39 AM
- ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జూన్ 2: సర్కారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలోని మహిళా మండలి భ వనంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం మహిళా సంఘ సభ్యులతో తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశా రు.
ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. పరిశుభ్రత పాటిస్తే రోగాలను దూరం చేయొచ్చన్నారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు ఈ సందర్భంగా ’ఒక మార్పు అభివృద్ధికి మలుపు’ అనే అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.