03-06-2025 01:03:21 AM
సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
రంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ అవతరణ దినోత్సవం లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆవరణలో సోమవారం అమరవీరులకు నివాళులర్పించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అమర్లకు నివాళులర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృత కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అణిచివేతకు, దోపిడీకి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనులు ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014న తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని... నాలుగు అంశాలు ఇందులో ప్ర ముఖ పాత్ర పోషిస్తాయని ఆయన వెల్లడించారు.
పేదల సంక్షేమం సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచస్థాయి ఇంట్రా డెవలప్మెంట్, పారదర్శకత పాలన అందించడం ప్రభుత్వము ఒక పాలసీ పెట్టుకుందని చెప్పారు. ఆడబిడ్డలకు అండదండలు ఇందిరా మహిళా శక్తి, ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500 కే వంటగ్యాస్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు,రుణమాఫీ,రైతు భరోసా, ధాన్యం కొనుగోలు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం,యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, అర్బన్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ, విశ్వవేదికపై తెలంగాణ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం,భూభారతి పథకాలను రాష్ట్రంలో పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం జిల్లా జీవనజ్యోతి మహిళా సమైక్యకు రూ.80 కోట్లకు నిధులకు సంబంధించిన 89 వేల చెక్కును,మెప్మా ద్వారా జిల్లాలోని 385 మహిళా సంఘాలకు రూ.50 కోట్ల రుణాలకు సంబంధించి సీఎం సలహాదారు లబ్ధిదారులు పంపిణీ చేశారు. అంతకుముందు అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి,అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్,డిసిపి సునీత రెడ్డి,ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు చల్లా నరసింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.