రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
19-04-2025 12:06 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): ఇటీవల పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో పిఆర్టియు కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అలాగే పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను కూడా సత్కరించారు.






