31-05-2025 06:58:12 PM
పాలమూరు యూనివర్సిటీ (విజయక్రాంతి): పాలమూరు యూనివర్సిటీ(Palamuru University) ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ ను బిసిటిఏ ఆధ్వర్యంలో పి చాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారితో విశ్వవిద్యాలయం అభివృద్ధి గురించి చర్చించడం చర్చించారు. బీటెక్, లా కళాశాలలు ప్రారంభించడం చాలా సంతోషకరంగా రాబోయే రోజుల్లో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని, యువతకు ఉపాధి అవకాశాలు కలిగే కోర్సులను ప్రారంభించాలన్నారు. దీంతో యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడేటట్టు చేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో బీసిటీఎ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, ఉపాధ్యక్షులు రాములు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.