31-05-2025 07:06:31 PM
మహబూబ్ నగర్ టౌన్ (విజయక్రాంతి): కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రిలయన్స్ ట్రెండ్స్ షేక్ నాగూర్ బాబు(Reliance Trends Shaik Nagur Babu) అన్నారు. శనివారం పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన మహబూబ్నగర్ మోడల్ స్కూల్ విద్యార్థులను పద్మావతి కాలనీ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా కేంద్రంలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ లో మెడల్స్, గిఫ్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ విద్యార్థులు కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.శివకుమార్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.