31-05-2025 06:49:14 PM
సదాశివపేట: శనివారం సదాశివపేట మండలానికి 22 మందికి పట్టణానికి 12 మందికి తొమ్మిది లక్షల ఆరు వేలు 906000 విలువగల చెక్కులను లబ్ధిదారులకు సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. సదాశివపేట మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ కార్యదర్శి పెద్దగొల్ల ఆంజనేయులు పిల్లిగుండ్ల వీరేశం మాట్లాడుతూ... అహర్నిశలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పేదలకు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నా దృష్టికి తీసుకువచ్చిన అందరికి కూడా గత పది సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను పంపిస్తున్నారని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారెనని కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అల్లం లలిత, మాజీ కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి, శమీ, నసీర్, మోబిన్, జున్ను, కళింపటేల్, మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సిద్దన్న, మానీక్, నరేష్ గౌడ్, రాములు, నాయకులు నాగేష్, రవి, గణేష్, సాయి, వాదోని శేఖర్, రాధాకృష్ణ, ప్రసాద్ గౌడ్, నాగుల విజయ్, బరాడి శివ, ప్రశాంత్, రవి, నారాయణ, రమేష్, శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.