10 June, 2026 | 6:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

03-02-2025 06:38 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాజలింగును పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సోమవారం కమిషనర్ ను కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా, పట్టణ అధ్యక్షులు చిలగాని సుదర్శన్, కొంపెల్లి రమేష్ కుమార్ లు మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సామల సత్యనారాయణ, కోశాధికారి గాదాసు శంకరయ్య, యూత్ అధ్యక్షులు ఉడుత చంద్ర మొగిలి, వెల్డి ప్రభాకర్, బండారి రాజేశం, చిలగాని చంద్రయ్య, కామని మార్కండేయ, రామ్ సురేష్, పత్తిపాక రవీందర్, మోర శంకరయ్యలు పాల్గొన్నారు.