17 April, 2026 | 10:20 AM

మత సామరస్యం చాటిన మానవ మూర్తి

16-12-2025 08:19 PM

బ్రహ్మంగారి ఆలయానికి రూ 2.50 లక్షల విరాళం..

నిర్మల్ (విజయక్రాంతి): హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ మంగళవారం మతసామరస్యాన్ని చాటారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునః ప్రతిష్టాపన పనుల కోసం రూ. 2.50 లక్షల విరాళాన్ని అందించి మానవతను చాటుకున్నారు. బ్రహ్మంగారి ఆలయానికి విరాళం అందించిన గ్రంథాలయ చైర్మన్ ను నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సోదరులు సంఘ సభ్యులు ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ రాకేష్ రమణ కోటగిరి గోపి మేడారం ప్రదీప్ ముప్పిడి రవి జగదీష్ తదితరులు ఉన్నారు.