07-02-2026 12:41:36 AM
హైదరాబాద్ సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 06 (విజయక్రాంతి): నమ్మకంగా పనిలో చేరాడు. అదనుచూసి, పుట్టినరోజు వేడుకంటూ తోటి సిబ్బందికి మత్తు మందు కూల్డ్రింక్స్ ఇచ్చి.. యజమాని ఇంట్లో భారీచోరీకి పాల్పడ్డాడు ఓ నేపాలీ వంటమనిషి. రూ.20లక్షలసొత్తుతో ఉడాయించాడు.
ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. జూబ్లీహిల్స్లో ని నందగిరి హిల్స్లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి ఇంట్లో 15 రోజుల క్రితం నేపాల్కు చెందిన భువన్కుంట పనిమనిషిగా చేరాడు. చాలా వినయంగా ఉంటూ అందరి నమ్మకాన్ని చూరగొన్నాడు. గురువారం రాత్రి య జమానులు ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పథకం వేశాడు. తన పుట్టినరోజు అని చెప్పి అక్కడి వాచ్మెన్కు, ఇతర పని మనుషులకు కూల్డ్రింక్స్ ఇచ్చాడు.
అప్పటికే అం దులో నిద్రమాత్రలు కలపడంతో, అది తాగి న కొద్దిసేపటికే వారంతా గాఢనిద్రలోకి జారుకున్నారు. దీతో భువన్ ఇంట్లోకి చొరబడి సుమారు 40 తులాల బంగారు, వజ్రాభరణాలు, కొంత నగదును మూటగట్టుకుని పరారయ్యాడు. శుక్రవారం ఉద యం ఎంతకీ పనిమనుషులు నిద్ర లేవకపోవడంతో అనుమా నం వచ్చిన స్థానికులు, యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిం చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, క్లూస్టీమ్ ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు బ్యాగుతో వె ళ్తున్న దశ్యాలు రికార్డయ్యాయి. పాతనేరస్తులైన నేపాలీ ము ఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నగర సరిహద్దులు దాటక ముందే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పని మనుషులను నియమించుకునేటప్పుడు కచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.