calender_icon.png 9 June, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా

09-06-2025 01:15:57 AM

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లతో భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి  నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని పరిశీలించి అనంతరం హరిజన వాడ లోని ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారు లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తూ మంజూరు పత్రాలను అందజేశారు.

అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పనులను ముగ్గువేసి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ  రాష్ట్రం అప్పుల్లో ఉన్న  ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు కట్టించి హామీలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ దళితుల ఇంటి పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే  తప్పకుండా నెరవేరుస్తుంద న్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను  మంజూరు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున  మంజూరయ్యాయన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి 3028 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.త్వరలో 472 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన  ఆరు హామీలను అమలు చేస్తూ ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నా మన్నారు.

రూ. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోస వంటి పథకాలను అందజేస్తున్నామనీ తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నా మనీ తెలిపారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ , cmrf చెక్కులను సకాలంలో లబ్ధిదారులకు  అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నా మనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంతరెడ్డి, మాజీ సర్పంచ్ ఐరేని నర్సయ్య, పాల్గొన్నారు. 

ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలి

కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): ఆలయ అభివృద్ధికి నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ కమిటీ ప్రతినిధుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథి గా  హాజరై ఆయన  మాట్లాడారు.

దోమకొండ మండల కేంద్రంలో చాముండేశ్వరి దేవి స్వామి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులు పాలకవర్గ సభ్యులతో  షబ్బీర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. చాముండేశ్వరి దేవి స్వామి  ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా  పెద్దారెడ్డి సిద్ధారెడ్డి. నార్ల వెంకటేశం.  నర్ర గుల్ల ఎల్లయ్య. నిమ్మ రాజేశ్వరి. పూల బోయిన రమేష్ గార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ.. చాముండేశ్వరి దేవి అమ్మవారు ఆలయం చాలా మహిమలు గలదని అన్నారు. అమ్మవారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని తెలిపారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి తమ పదవిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టి పి సి సి కార్యదర్శి బద్ద బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, అనంతరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పెద్దారెడ్డి సిద్ధారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అబ్రబోయిన స్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా క్యాంటీన్ పరిశీలన

కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జజిల్లా దోమకొండ మండల కేంద్రంలో  మహిళా సమైక్య క్యాంటిన్ ను ఆదివారం ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌అలీ షబ్బీర్ పరిశీలించారు. క్యాంటీన్ నడుపుతున్న మహిళా సంఘ సభ్యులు  క్యాంటీన్ సముదాయం కిరాయి ఎక్కువ ఉందని షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువస్తే వెంటనే కలెక్టర్ తో మాట్లాడి కిరాయి తగ్గించి రూ.500 మాత్రమే చెల్లించే విధంగా చూడమన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ తెలంగాణకు మహిళలే పునాది. అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నా మన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు.

పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ, ఆదర్శ కమిటీలకు అప్పగించా మన్నారు.  మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. పెట్రో ల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంకుట్టుపనితో పాటు .మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్ లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ఆలోచన చేశా మన్నారు.

ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసి రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నా మన్నారు.  భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీది మాట ఇస్తే తప్పని పార్టీ అన్నారు.  మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, అబ్రబోయిన స్వామి ముదిరాజ్, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.