ఆయుష్కు రెగ్యులర్ కమిషనర్ను నియమించాలి
23-06-2024 01:21 AM
పెన్షనర్ల విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఆయుష్ విభాగానికి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పెన్షనర్లు కోరారు. రెగ్యులర్ కమిషనర్ నియమించకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కారం కావడంలేదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.






