16-06-2025 05:30:56 PM
చివ్వేంల: చివ్వేంల మండలం(Chivvemla Mandal) బండమీది చందుపట్ల గ్రామంలోని ఊరచెరువులోని తామర పువ్వుల బహిరంగ వేలం పాట గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు నాయకులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఉన్న ఊర చెరువులొని తామరపువ్వుల వేలంను ఎవరికీ తెలియకుండ మా గ్రామ పంచాయతీ కార్యదర్శి గుట్టుచప్పుడు కాకుండా ఒక వ్యక్తికి తక్కువ ధరకు ఒక సంవత్సరం పాటు రాసి ఇచ్చారు. ఇట్టి విషయాన్ని ఆరా తీయగా గ్రామానికి ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉన్నా తక్కువగా తనకు నచ్చిన వ్యక్తికి రాసిచ్చారు.
వెంటనే ఆ పాటను రద్దు చేసి మా గ్రామంలో బహిరంగ వేలం పాటవేసి గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చేలా మా గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కార్యదర్శిని కోరగా వారు నిరకరించారు. ఈ విషయంను పై అధికారులు మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ కి, ఎంపీడీఓకి వినతి పత్రం ద్వారా విచారణ కోరడమైనది. ఈ విషయం వివిధ దినపత్రికలలో కూడ వచ్చింది. అయినా కొంత జాప్యం జరుగుతున్నందున తమరికి తెలియజేసుకుంటున్నాము. మీరే మా గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చేలా పాత పాటను రద్దు చేసి వెంటనే బహిరంగవేలం పాట వేసి మా గ్రామానికి న్యాయం చేయగలరని కోరడమైనది. ఈ కార్యక్రమంలోతెలంగాణ యువజన సంఘం చివ్వేంల మండల అధ్యక్షులు చెరుకు నగేష్, శిగ వీరస్వామి, శ్రీనివాస్, కోడి రవి, తదితరులు పాల్గొన్నారు.