28 June, 2026 | 12:04 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ

27-03-2025 01:02 AM

పార్లమెంటులో ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బుధవారం పార్లమెంటులో రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ య్య కోరారు. కేంద్రంలో 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలో 93 విభాగాలు ఉన్నాయని.. కానీ నేటికీ ఓబీసీ మంత్రిత్వ శాఖ కలగానే మిగిలిపోయిందన్నారు.

ఓబీసీల సంక్షేమ అభివృద్ధిని చూసుకోవడానికి ప్రత్యేక విభాగం లేద న్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు తదితర అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని.. ఓబీసీలు ఏం పాపం చేశా రని ప్రశ్నించారు. దేశంలో మెజారిటీ జనాభాకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అన్యాయమన్నారు.