9 April, 2026 | 5:07 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్..!

20-12-2025 12:00 AM

* కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, నాయకులు

మెదక్, డిసెంబర్ 19(విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్లతో పాటు, పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి హరీష్రావు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన బీఆర్‌ఎస్ నేత చింతల నర్సింలు శుక్రవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

అలాగే హవేలీ ఘన్పూర్ మండలం జక్కన్నపేట బీఆర్‌ఎస్ సర్పంచ్ చామంతుల సత్యనారాయణతో పాటు ఇదే మండలం పోచంరాల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సర్పంచ్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇది కీలకమైన రాజకీయ పరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరిన వారంతా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు.