17-06-2025 12:17:35 AM
కరీంనగర్, జూన్ 16 (విజయక్రాంతి): కరీంనగర్ వైద్య కళాశాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిపై కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయక్రాంతి దినపత్రికలో ‘వెంటిలేటర్పై కరీం నగర్ వైద్య కళాశాల’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితం కావడంతో మరిన్ని సమస్యలు విజయక్రాంతికి వివరించేందుకు కొం దరు ముందుకు వచ్చారు.
ఈ కళాశాల ప్రిన్సిపాల్ కంటే ఏవోదే పెత్తనం నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రిన్సిపాల్ తరచూ సెలవుల్లో ఉండటంతో ఏవోనే అన్ని తానై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ స్వయంగా ఓ అధికారే తరచూ షార్ట్ ఫిలింలను తీస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా ఈ షార్ట్ఫిలింలను ప్రచారం చేస్తున్నాడు. ఇదే కళాశాలలో పనిచేసే ఒక ఉద్యోగితో కలిసి చేసిన షార్ట్ఫిలిం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక్కడ ఆయనే మొత్తంగా బాస్గా వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వైద్య విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు కావడం, హాస్టల్లో ఉంటూ తరగ తులు ముగియగానే తిరిగి హాస్టల్కు చేరుకుంటుండటంతో సదరు అధికారిపై ఫిర్యాదు చేసేందుకు సాహసించడం లేదు. విచిత్రమేమిటంటే దీని పక్కనే ఉన్న ప్రభుత్వ విత్తనాభి వృద్ధి సంస్థలో పనిచేస్తున్నవారికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయడం, కొందరికి ఇప్పించడం వివాదానికి దారితీసింది.
ఒక అధికారి ఇద్దరు పిల్లలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించడంతో వారి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కలెక్టర్ విచారణ కమిటీ వేసి విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంపై విచారణ సజావుగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కనిపించని బయోమెట్రిక్
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా ఉంటుంది. కరీంనగర్ వైద్య కళాశాలలో మాత్రం బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నది. ఎప్పుడు వెళ్తున్నది ఆన్లైన్లో నిక్షిప్తం కాకుండా పోతున్నది.
బయోమెట్రిక్ లేకపోవడంతో ఉద్యోగుల నుంచి ప్రొఫెసర్ల వరకు సమయపాలన పాటించడంలేదు. ఈ కళాశాలలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థి సంఘా ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
జవాబుదారీతనం లేదు
కరీంనగర్ వైద్య కళాశాలలో జవాబుదారీతనం కొరవడింది. ప్రిన్సిపాల్ అందుబా టు లో ఉండటం లేదు. బోధన సమస్య తీవ్రంగా ఉన్నది. ప్రాక్టికల్స్ సజావుగా జరగడం లేదు. ఇక్కడ ఒక అధికారి వ్యవహారశైలి వల్ల విద్యార్థులే కాదు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఇలానే ఉంటే ఈ విద్యాసంవత్సరం వైద్య విద్య సీట్లు ఎంఐసీ కేటాయించ డం కూడా కష్టమే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలపై ప్రత్యేక దృష్టిసారించి ఫ్యాకల్టీని పూర్తిస్థాయిలో నియమించి, భవనాన్ని త్వరగా నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేకుంటే ఆందోళన నిర్వహిస్తాం.
కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు