calender_icon.png 17 June, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశా.. తప్పు ఎవరిది?

17-06-2025 12:15:04 AM

  1. విద్యుత్ ప్రమాదానికి బాధ్యులు ఎవరు?
  2. మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం 
  3. కరువైన నిఘా,రక్షణచర్యలు

జగిత్యాల, జూన్ 16 (విజయక్రాంతి): ’తప్పు ఎవరిది?..’ సర్వత్రా ఇదే చర్చ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రం లోని బాలాజి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద ఆదివారం జరిగిన విద్యుత్ ప్ర మాదంలో ఆ కేంద్ర యజమానితో పాటూ మరో వ్యక్తి మృతి చెందగా, ఏడుగురు వ్య క్తులు విద్యుత్ షాక్’కు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అదే రోజు తయారు చేసిన విగ్రహాన్ని తరలిస్తున్న నేపథ్యంలో సదరు విగ్రహం తడిగా ఉండడం..

విగ్రహానికి 33 కెవి విద్యుత్ లైన్ తగిలి షాక్ రావ డం.. విగ్రహాన్ని పట్టుకున్న 9 మంది షాక్’కు గురై అక్కడికక్కడే కుప్ప కూలడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటనలో ఇరువురు మృతి చెందగా, మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. జరిగిన ప్రమాదం తో జిల్లా వ్యాప్తంగా ఓ ఆలోచన మొదలైంది. అసలు ఈ విగ్రహాల తయారీ కేంద్రా లు ఏంటి? ఇక్కడ ఏం జరుగుతున్నది? అనే చర్చ తెరపైకి వచ్చింది.  

తెలంగాణ ప్రాంతంలో మొట్ట మొదట వినాయక విగ్రహాల తయారీ జగిత్యాల జిల్లా కోరుట్లలో రూపుదిద్దుకుంది. గతంలో మహారాష్ట్రలోని ముంబై, పూణేతో పాటూ ఆంధ్ర, తమిళ ప్రాంతాల నుంచి విగ్రహాలు మన ప్రాంతానికి దిగుమతి అయ్యేవి. కోరుట్లకు చెందిన గంగాధర్ అనే శిల్ప కళాకారుడు ముంబైలో శిక్షణ పొంది ’శిల్పకళా ఆర్ట్’ పేరి ట 1983లో కోరుట్ల పట్టణంలో ఓ విగ్రహ తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు.

ఆయన వద్ద పని చేయడానికి వచ్చిన పలువురు యువకులు కొద్ది రోజులు కాగానే, బయటకు వచ్చి తాము స్వయంగా ఓ విగ్రహాల తయారీ కేంద్రం పెట్టడం ప్రారంభించారు. కోరుట్లలోనే కాకుండా ఇతర పట్టణాల్లో సై తం విగ్రహ తయారీ కేంద్రాలు పెట్టడం ప్రా రంభించారు. అలా ఒక్కటొక్కటిగా పెరిగి ప్ర స్తుతం కోరుట్ల - మెట్పల్లి ప్రధాన రహదారిని ఆనుకొని కేవలం కోరుట్ల పట్టణంలోనే దా దాపు 26 వినాయక విగ్రహాల తయారీ కేం ద్రాలు వెలిసాయి.

ఈ కేంద్రాల్లో సుమారు 250 నుండి 300 మంది వరకు కార్మికులు పని చేస్తున్నారు. ఇవేకాక తెలంగాణ వ్యా ప్తంగా పలు జిల్లాల్లో, ప్రధాన పట్టణాల్లో వి నాయక విగ్రహాల తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా విగ్రహాల తయారీ ’గుత్తా’గా మారిం ది. అంటే ఈ మోడల్, ఈ సైజు వి గ్రహం తయారీకి ఇంత.. అని ఒప్పందం కుదుర్చుకొని విగ్రహం తయారు చేస్తారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వలస వచ్చి విగ్రహాలు తయారు చేస్తున్నారు. కోరుట్లలో తర్ఫీదు పొందిన వ్యక్తులు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లి ’గుత్తా’ పద్ధతిలో పని చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉండగా సదరు కేంద్రాలపై ప్రభుత్వ పరమైన నిఘా, నియంత్రణ కరువవడం విచారకరం. అది కాస్తా ప్ర మాదకరంగా కూడా పరిణమించింది.

ఇందుకు ప్రధాన కారణం అన్ని కేంద్రాల పక్షాన ప్రతి ఏడాది భారీగా ముడుపులందడం. ఈ నేపథ్యంలో మున్సిపల్, పోలీస్, లేబర్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులకు సంవ త్సరానికి ఇంత అని ఒప్పందం కుదుర్చుకొ ని ముట్ట చెబుతున్నట్లు సమాచారం.

కాగా ఈ మామూళ్ల తతంగంలో పత్రికా రంగం పేర కూడా కొందరు జర్నలిస్టులు చేతివా టం చూపడం కోసమెరుపు. ఇప్పటికైనా సం బంధిత శాఖల ప్రభుత్వ అధికారులు స్పం దించి సదరు విగ్రహాల తయారీ కేంద్రాలపై నిఘా పెంచి, అవసరమైన రక్షణ చర్యలు చేపడితేబాగుంటుంది.