17-06-2025 12:00:00 AM
- అధిక వర్షాలు సంభవించినపుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
- నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 15 (విజయ క్రాంతి); వ్యవసాయ సీజన్ అదునుగా అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కు పాదం మోపాలని, అధిక వర్షాలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదర్శించారు.
సో మవారం జిల్లా ఎస్పీ కార్యాలయలోని కాన్ఫరెన్స్ హాలు నం దు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతీ కేసులో ’క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాల న్నారు.
పెట్రోలింగ్,బ్లూ కోలట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గంజాయి వంటి మత్తు పదా ర్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు, గం జాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివా స ప్రాంతాల్లో , వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. వర్షాకాలంలో అధిక వర్షాలు సంభవించినపుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలను నడు పుతూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమ య్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పం దించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అం డగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వ యం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యా యాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యా యం చేకూరేలా పనిచేయాలని తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ వి క్రాంత్ కుమార్ సింగ్ ,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి జిల్లాలోని ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.