calender_icon.png 17 June, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.11 కోట్లతో నూతన విద్యుత్ స్తంభాలు

16-06-2025 11:49:24 PM

- త్వరలో రెండు నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన..

- విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పటాన్ చెరు: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ అందించదానికి నూతన సబ్ స్టేషన్ లతోపాటు రూ.11 కోట్లతో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ పరిధిలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో మొదలు డివిజన్ వరకు విద్యుత్ శాఖ అధికారులతో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి విద్యుత్ స్తంభాల పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించినట్లు తెలిపారు.

ప్రధానంగా ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలతో పాటు  తుప్పు పట్టిన స్తంభాలా స్థానంలో నూతన స్తంభాలు, వదులుగా ఉన్న వైర్ల స్థానంలో నూతన వైర్లు ఏర్పాటు చేసేందుకు పటాన్ చెరు డివిజన్ పరిధిలో రెండు కోట్లు, ఇస్నాపూర్, కొల్లూరు సబ్ డివిజన్ పరిధిలో తొమ్మిది కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. గత వేసవిలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించి ప్రజల మన్ననలు పొందినట్లు తెలిపారు. వర్షాకాలంలోనూ ఇదేవిధంగా పనిచేయాలని సూచించారు.

త్వరలో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీ, బీరంగూడ గోశాల, రామచంద్రాపురం మండల పరిషత్ ఆవరణలో రూ.15 కోట్లతో నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీ, పోచారం గ్రామ పరిధిలో నూతన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. నూతన కాలనీలకు సైతం విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నూతన సబ్ స్టేషన్ల  ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు,  పటాన్ చెరు డిఈ భాస్కర్, ఏడీఈలు తులసి రామ్, సంజీవ్, దుర్గాప్రసాద్, నాగరాజు, మాధవరావు, ఏఈలు పాల్గొన్నారు.