19-06-2025 10:32:39 PM
గ్యాస్ ఇప్పిస్తానని రూ. 1500 కాజేసిన వైనం..
లబోదిబోమంటున్న బాధితులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
యాచారం: గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లిన వృద్ధులను ఓ కేటుగాడు బురిడీ కొట్టించిన ఘటన యాచారం మండలం(Yacharam Mandal)లో చోటుచేసుకుంది. అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నక్క పండరీ, పార్వతమ్మ దంపతులు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు వెళ్లారు. భోజన సమయం కావడంతో సిబ్బంది షటర్ కిందికి తీసి, లోపల భోజనం చేస్తున్న సమయంలో నక్క పండరీ, పార్వతమ్మ దంపతులు బయట ఉన్నారు. వారిని గమనించిన కేటుగాడు సిలిండర్ ఇప్పిస్తానని రూ.1500 వారి నుండి తీసుకున్నాడు. నేను మీ ఇంటికి పంపిస్తా మీరు వెళ్లిపోండి అని చెప్పారు. ఆయన వాళ్ళు వెళ్లిపోకుండా అతని చుట్టే గమనిస్తున్నారు.
అదే సమయంలో అగాధకుడు గ్యాస్ బండి తీసుకొస్తా అని చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. అతనిపై అనుమానం రావడంతో, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వండి సార్ అని అడగగా, మేము లంచ్ చేస్తున్నాము. అందుకే షెటర్ బందు చేసినాము. మేము తీసుకోలేదు, ఎవరు తీసుకున్నారని సీసీ కెమెరా ఫుటేజీ చూడగా గుర్తుతెలియని వ్యక్తులు మోసం చేసి, వృద్ధుల వద్ద రూ.1500 దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఇండియన్ గ్యాస్ యజమాని శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా ఇండియన్ గ్యాస్ వినియోదారులు ఎప్పుడైనా ఆఫీసులోపల సిబ్బందికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని, ఇతరులు ఎవరైనా గ్యాస్ ఇప్పిస్తానని అడిగినా నగదు ఇవ్వవద్దని వినియోగదారులకు సూచించారు.