calender_icon.png 20 June, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాలో విద్యార్థులందరూ పాల్గొనాలి

19-06-2025 10:35:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యోగా సాధనలో భాగంగా అవసరమయ్యే యోగ మ్యాట్లు అందించామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌ అహ్మద్‌(Additional Collector Faizan Ahmed) తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధీర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సువర్ణ దుర్గ కంపెనీ సహకారంతో అందించిన వెయ్యి యోగ మ్యాట్లను జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, విద్యార్థుల్లో యోగాపై అవగాహన పెంచాలన్నారు. కేజీబీవీలు, పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులు యోగా సాధనలో భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయిలోనే యోగాను విద్యార్థుల జీవనశైలిలో భాగం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పి. రామారావు, ఎస్సీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్, మోహన్ సింగ్, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, సలోమి కరుణ, రాజేశ్వర్, లింబాద్రి, ప్రవీణ్, నరసయ్య, కేజీబివి ప్రత్యేక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.