1 July, 2026 | 10:05 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

30-04-2025 12:00 AM

జడ్పీ సీఈఓకు వావిళ్ల రమేష్ గౌడ్ ఫిర్యా దు

పెన్ పహాడ్, ఏప్రిల్ 29 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, సంపన్న కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఎంపీడీఓకు జాబితా పంపుతున్నట్లు ఆజాబితానే తుది జాబితాగా గుర్తిస్తున్నట్లు వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను పునః పరిశీలన చేసి అక్రమ వసూలు.. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా పరిషత్ సీఈఓ వీవీ అప్పారావుకు మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ వావిళ్ల రమేష్ గౌడ్ మండల యువతతో కలసి వినతి పత్రం అందజేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు సైతం పాలక వర్గాలకు అనుకూలంగా మారి వారు పంపిన పేర్లను జాబితాలో పొందపర్చడంతో నిజమైన అర్హులకు ఇందిరమ్మ గూడు దూరమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కాకుండా భూస్వాములకు, సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీలకు అధికారులు వత్తాసు పలకడం హేయమైన చర్యన్నారు.

అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై రిసర్వే చేసి సంపన్నలను, అనర్హులను జాబితానుంచి తొలగించి నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు అందేలా, చూడాలని కోరారు. లేని ఎడల గ్రామాలలో పేదలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి హక్కులు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వారి వెంట గంగారపు శ్రీనివాస్, భూక్యా అశోక్, చంటి నాయక్, భూక్యా వెంకటేశ్వర్లు ఉన్నారు.