11-02-2026 12:00:00 AM
బోయినపల్లి: ఫిబ్రవరి 10(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోదురుపాక ప్రధాన రహదారి (ఎక్స్ రోడ్) పై పశుగ్రాసం తీసుకెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా నగునూరు నుంచి వేములవాడకు రెండు ట్రాక్టర్లలో పశుగ్రాసం తీసుకెళ్తుండగా అందులో ఒకట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ రైతులు చకచక్యంగా క్రిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం ఎక్సవేటర్ సాయంతో పశు కోసం ట్రా క్టర్ ను పైకి లేపి పంపించారు.