20 July, 2026 | 5:37 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

విషాదంగా విహారయాత్ర

20-07-2026 12:00 AM

గుండం జలపాతంలో మునిగి యువకుడు మృతి 

ములుగు, జూలై 19 (విజయక్రాంతి): విహారయాత్ర విషాదంగా మారుతోంది. పది రోజుల వ్యవధిలో ములుగు జిల్లా విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు జలపాతంలో పడి దుర్మరణం పాలైన ఘటనతో విషాదం నెలకొంది. హైదరాబాదుకు చెందిన నలుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా వాజేడు మండలం గుండం జలపాతాన్ని సందర్శించడానికి రాగా అక్తర్ ఉద్దీన్( 24) అనే యువకుడు కాలుజారి నీటిలో మునిగిపోయాడు.

ఈత రాకపోవడంతో జలపాతంలో పడ్డ అతని కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా గంట తర్వాత ఆచూకీ లభ్యమయింది. వెంటనే అతన్ని బయటికి తీసుకువచ్చి తోటి స్నేహితులు సిపిఆర్ చేసి 108 కు సమాచారం అందించారు. ఇది తెలుసుకున్న వాజేడు ఎస్త్స్ర జక్కుల సతీష్ తమ సిబ్బందిని ఆ జలపాతానికి పంపించి. 108 సహాయంతో ఏటూరు నాగారం  ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. విహారయాత్ర కాస్త విషాదంగా మారింది.