31-05-2025 02:26:45 PM
నీట్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన
హైదరాబాద్: నీట్ పరీక్ష(NEET Exam)పై ఆకాశ్ ఇన్స్టిట్యూట్ షేక్పేట్ బ్రాంచ్(Aakash Institute Shaikpet Branch) జూన్ 1న వికారాబాద్లో మెగా సెమినార్(Mega Seminar) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. నీట్ణో చేసిన తప్పులను సరిదిద్దుకోవడం. నీట్ 2026లో ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ప్రముఖ ఫ్యాకల్టీ పట్టణానికి వచ్చి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారు. అలాగే నీట్ పరీక్షలోని వివిధ సబ్జెక్ట్లు, అధ్యాయాలు, కష్టతరమైన టాపి క్లకు సంబంధించిన లోతైన అవగాహన కల్పించి నీట్ పరీక్షను సమర్థవంతంగా రాసేందుకు మార్గనిర్దేశనం చేస్తారు. ఈ సెమినార్లో పాల్గొనదలిచిన విద్యార్థులు వికారాబాద్ ఆకాశ్ సెంటర్ హెడ్ శ్రీధర్(Vikarabad Aakash Center Head Sridhar)ను ఫోన్ నంబర్ 98665 40606లో సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.