31-05-2025 09:44:16 AM
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్(Indian Premier League- 2025) సీజన్ లో రెండు అరుదైన మైలురాళ్లతో రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ముల్లాన్ పూర్ లో నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ మ్యాచ్లో టోర్నమెంట్( IPL 2025 Eliminator) చరిత్రలో 7000 పరుగులు, 300 సిక్సర్లు రెండింటినీ దాటిన రెండవ ఆటగాడిగా రోహిత్ శర్మ(Rohit Sharma) నిలిచాడు. అయితే ఈ కీలకమైన మ్యాచులో ప్రారంభం నుండే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ కేవలం 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో నాలుగు భారీ సిక్సర్లు, ఏడు బౌండరీలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. తన చిరకాల స్వదేశీయుడు విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లోని 9వ ఓవర్ లో రషీద్ ఖాన్ బౌలింగ్(Rashid Khan bowling)లో భారీ సిక్స్ కొట్టడం ద్వారా రోహిత్ శర్మ ఈ మైలురాయిని చేరుకున్నాడు. మ్యాచ్ లో నాలుగు సిక్స్ లు కొట్టడం ద్వారా, రోహిత్ శర్మ ఐపీఎల్ లో 300-సిక్సర్ల మార్కును కూడా అధిగమించాడు. 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ క్రికెటర్ గా అతను నిలిచాడు. అతని పేరు మీద 357 సిక్స్ లున్నాయి. రోహిత్ ఇప్పుడు మొత్తం 302 సిక్స్ లు బాదాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 291 సిక్స్ లతో అతని వెనుక మూడవ స్థానంలో ఉన్నాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో రోహిత్ 271 మ్యాచ్ల్లో 29.82 సగటుతో 7038 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు, 109* అత్యుత్తమ స్కోరు ఉంది. ఐపీఎల్ లో రోహిత్ శర్మ రెండు మైలురాళ్ళు సాధించడంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.