01-06-2025 12:50:15 AM
నేడు ముంబై, పంజాబ్ క్వాలిఫయర్
అహ్మదాబాద్, మే 31: ఐపీఎల్ 18వ సీజన్ తుదిదశకు చేరుకుంది. ఆదివారం క్వాలిఫయర్ ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న ఆర్సీబీతో ఫైనల్ ఆడనుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేదు.
కానీ ముంబై మా త్రం ఐదుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. నేడు జరిగే పోరులో పంజాబ్ గెలిస్తే కొత్త జట్టు ట్రోఫీని చేజిక్కించుకునేందుకు అ వకాశం ఉంటుంది.ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ను మట్టికరిపించిన ముంబై ఆ త్మవిశ్వాసంతో ఉండగా..క్వాలిఫయర్ పేలవ ప్రదర్శనతో పంజాబ్ మాత్రం ఒత్తిడిలో ఉంది.