9 May, 2026 | 5:44 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

11-12-2024 12:40 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 10: మణికొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికా రులు తనిఖీలు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈఈ దివ్యజ్యోతి ఇంట్లో ఇటీవల జరిపిన ఏసీబీ దాడుల్లో పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆమె గతంలో పనిచేసిన మణికొండ మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేసినట్లు సమాచారం. దివ్యజోత్యి ఇక్కడ డీఈఈగా పనిచేసిన సమయంలో.. ఆమె అప్రూవ్ చేసిన ఫైల్స్, సంబంధిత డాటాను ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు.

డీఈఈ దివ్యజ్యోతి ఇక్కడ పనిచేసిన సమయంలో మున్సిపల్ నిదులను పెద్దఎత్తున నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడుల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని మిగితా మున్సిపాలిటీల ఉన్నతాధికారులు సెలఫోన్లను స్విచ్ఛాఫ్ చేయడంతో పాటు ఆఫీసుల నుంచి వెళ్లిపోయారు.