డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ(Anti Corruption Bureau) అధికారులు సోదాలు చేస్తున్నారు. నార్సింగిలోని వేసెల్లా మెడోస్ లోని భీమ్ రెడ్డి ఇల్లుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. భీమ్ రెడ్డి(DSP Bhim Reddy) నార్సింగిలో రూ. 8 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాలో ఉంటున్నారు. భీమ్ రెడ్డి వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమ్ రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని భీమ్ రెడ్డి మీద ఆరోపణలున్నాయి. డీజీపీ ఆఫీసులోని కంప్యూటర్ సర్వీసెస్ లో భీమ్ రెడ్డి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. భీమ్ రెడ్డికి చెందిన భారీ అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు(ACB officials) పేర్కొన్నారు.






