తుంగతుర్తిలో ఏసీబీ సోదాలు
03-06-2026 11:24 AM
అడిషనల్ ఎస్పీ భుజంగరావు మామగారు రాజేశ్వరరావు ఇంటిలో సోదాలు.
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో హైదరాబాదులో ఇటీవల ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితులై, అక్రమాస్తులతో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు రాష్ట్ర ఏసీబీ(ACB Raids) అధికారుల ఆదేశాల మేరకు మామ రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంటిలో ఎవరు లేరని, తాళం వేసి ఉండడంతో, దీనితో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోయామని, తదుపరి విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.






