రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
27-07-2026 05:48 PM
* ఏవో వేల్పుల పూజ
హుస్నాబాద్: ప్రస్తుత ఎల్నినో ప్రభావం దృష్ట్యా తక్కువ నీటి అవసరమున్న పప్పు ధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని హుస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారిణి వేల్పుల పూజ అన్నారు. సోమవారం హుస్నాబాద్ రైతు వేదికలో ఏవో వేల్పుల పూజ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచి, వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.మూడు రోజుల పాటు జరిగే ఈ విత్తన మేళాలో రైతులు తమకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు.






