9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదం

01-10-2025 12:00 AM
  1. తొమ్మిది మంది వలస కూలీలు మృతి
  2. తమిళనాడులోని ఎన్నూర్‌లో ఘటన

చెన్నై, సెప్టెంబర్ 30: తమిళనాడు ఎన్నూర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కాంక్రీట్ ఆర్చ్ పనుల్లో భాగస్వాములవుతున్నారు. రోజూలాగానే మంగళవారం పనులకు వెళ్లిన కూలీలు పనిచేస్తున్నారు. ఈక్రమంలో 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే ఇనుప దిమ్మెలు పైనుంచి కూలి కింద పనిచేస్తున్న కూలీలపై పడ్డాయి.

ఘటనలో పది మంది కార్మికులు తీవ్రగాయాలయ్యారు. తోటి కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించి, వైద్యం చేయిస్తుండగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు మరో కార్మికుడికి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా అస్సాంకు చెందిన వారని తెలిసింది. ఘటనపై కట్టూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని పరామర్శించారు.