20-02-2026 06:34:47 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు గడువు ముగియనుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.హరితకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 50 శాతం పత్తి ఇంకా రైతుల వద్దనే ఉందని, గడువు ముగిస్తే దళారుల చేతిలో రైతులు నష్టపోతారని హెచ్చరించారు. కాబట్టి పత్తి కొనుగోలు గడువును కనీసం మార్చి 30 వరకు పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల కార్తీక్, రాజేందర్, నిఖిల్ పాల్గొన్నారు.