9 April, 2026 | 5:08 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

మోదీజీ.. మీరు లద్దాఖ్ ప్రజలను మోసం చేశారు!

01-10-2025 12:00 AM

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: ‘ప్రధాని మోదీజీ.. మీరు లద్దాఖ్ ప్రజలను మోసం చేశారు. అక్కడి ప్రజలు కేవలం వారి హక్కులను సాధించుకునేందుకే పోరాటం చేస్తున్నారు. దయచేసి హింసా రాజకీయాలు ఆపండి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకండి. వారితో సంభాషించండి. వారి బాధలు తెలుసుకోండి’ అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు.

జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పోలీస్ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతిచెందిన ఘటపై మంగళవారం ఆయన పార్లమెంట్ వేదికగా విరుచుకుపడ్డారు. అక్కడ జరిగిన హింసాకాండపై నిష్పక్షపాతమైన న్యాయ విచారణ జరపాలని, దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖాకార్జున ఖర్గే మా ట్లాడుతూ.. ‘లద్దాఖ్ ప్రజల దుఃఖం.. దేశమంతటి దుఃఖం’ అని పేర్కొన్నారు.