09-06-2025 10:59:24 PM
ఇద్దరికి తీవ్ర గాయాలు..
నుజ్జునుజ్జయిన కారు, బైక్..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) కోహెడ మండలం శ్రీరాములపల్లి కెనాల్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బెజ్జంకి మండలం గాగిల్లపూర్ గ్రామానికి చెందిన కారు శ్రీరాములపల్లి కెనాల్ రోడ్డు గుండా ప్రయాణిస్తుండగా, అక్కనపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన ద్విచక్రవాహనం దానిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ధాటికి బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం దెబ్బతినగా, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.