10-06-2025 12:00:00 AM
ఇతర సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఎన్నికల్లో తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడతానని పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయమై నమోదైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాడి కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాటి ఎన్నికల నోడల్ ఆఫీసర్ కమలాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. ఈకేసులో ఇప్పటికే పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
ఆ కేసును కొట్టివేయాలంటూ కౌశిక్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ.. కౌశిక్రెడ్డిపై నమోదైన సెక్షన్ 188ను మాత్రం కొట్టివేస్తున్నామని, కానీ.. మిగతా సెక్షన్లన్నింటిలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కేసు కొట్టివేత పిటిషన్ను తోసిపుచ్చింది.