calender_icon.png 29 June, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రిడిటేషన్ గడువు మరో మూడు నెలలు పొడిగింపు

29-06-2025 02:00:52 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలి స్టులకు సంబంధించిన అక్రిడిటేషన్(గుర్తిం పు కార్డు) గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. మరో మూడు నెలలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనున్నది.

అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు అర్హులైన జర్నలిస్టులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ సూచనలను ప్రభుత్వానికి అందజేసిందని, ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల అనంతరం అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా కొత్త నిబంధనలతో కూడిన నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జర్నలిస్టులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.