calender_icon.png 29 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీబీ ఉద్యోగుల పీఆర్‌సీపై మంత్రి తుమ్మలతో టీజీకాబ్ పాలకవర్గం భేటీ

29-06-2025 02:02:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): డీసీసీబీ బ్యాంక్ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) అంశంపై శనివారం టీజీకాబ్ పాలకవర్గం సభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వ కంగా కలిసి చర్చించారు. ఈ సమావేశంలో టీజీకాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీసీసీబీ ఉద్యోగుల పీఆర్‌ఎసీ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో త్వరలోనే ఆమోదం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

రైతు భరోసా కింద 9 రోజుల వ్యవధిలోనే రూ. 9000 కోట్లు  విడుదల చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మలకు వారు ప్రత్యే క కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో టీజీకాబ్ డైరెక్టర్లు భోజ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.