29-06-2025 01:56:56 AM
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ జితేందర్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా నలభై నాలుగు మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ నాగేశ్వర్రావు డీజీ కంట్రోల్ రూం నుంచి సీసీఎస్ హైదరాబాద్కు ఏసీపీగా బదిలీ అయ్యారు. ఆకుల చంద్రశేఖర్ను మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు.
సాయిరె డ్డి వెంకట్ రెడ్డిని డీజీ కంట్రోల్ రూం నుంచి ఎస్డీపీఓగా కల్వకుర్తికి బదిలీ చేశారు. కొంతం చంద్రశేఖర్ రెడ్డిని మెదక్ నుంచి మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. రంగస్వామిని సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు. అదే విధం గా ఏసీపీ సంపత్కుమార్ను రాచకొండ కమాండ్ కంట్రోల్ ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు.
బదిలీ అయిన డీఎస్పీల జాబితాలో వెంకటేశ్వర్లు, కందుల సత్యనా రాయణ, కిరణ్కుమార్, వై.నరసింహా రెడ్డి, శ్రీనివాస్, సత్తయ్య, శ్రీనివాస్, రణవీర్ రెడ్డి, శ్రీనివాస్జీ, విజయ్కుమార్, శ్రీనివాస్, ప్రవీందర్ రావు, రమేష్కుమార్, మనోజ్ కుమార్, శంకరయ్య, రామ్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుపతి, రామ్మోహన్ రెడ్డి, సతీష్, శివభాస్కర్, నర సింహులు, రాములు, మహేష్, దుర్గాప్రసాద్, సర్దార్ సింగ్, సత్యనారాయణ, జీ.శ్యాంసుందర్, ఎన్.ఎన్. ఎస్వీ వెంకటేశ్వరరావు, భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఫైళ్ల రవీందర్ రెడ్డి, జీ.రవి, కే.పురుషోత్తం రెడ్డి, టీ.సత్యనారాయణ, ఆర్.సత్యనారాయణ రాజు, ఏ.సూర్యనారాయణ, బీ.కిషన్ కుమార్, బీ.నందిరామ్ నాయక్ ఉన్నారు.