12 June, 2026 | 2:05 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

12-06-2026 01:27 PM

ఇల్లందు, జూన్ 12 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను జనసేన పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మద్ది సాయికుమార్ మాట్లాడుతూ చిన్నారి జీవితాన్ని ఛిద్రం చేసే ఇటువంటి దారుణాలకు నాగరిక సమాజంలో స్థానం లేదన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆంగోత్ శ్రీను, మద్ది సాయికుమార్, ముత్యాల వీరబ్రహ్మం, ఆవుతుర్తి శ్రావణ్, మధు యాదవ్, కాయం శాంతికుమార్, హేమంత్, బానోత్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.