12 June, 2026 | 2:04 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం

12-06-2026 01:26 PM

మల్లాపూర్, జూన్ 12(విజయక్రాంతి): మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం అధ్యాపకులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవల గురించి వివరించారు.

ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఇంటర్ తర్వాత ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు సంతోష్, రాజేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటర్ అడ్మిషన్లపై అవగాహన కల్పించి, ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు.