21-06-2025 05:05:01 PM
వనపర్తి టౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష, యాదగిరి రమేష్ రాములు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని గ్రామ గ్రామాన వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పిన మహనీయుడని వారు కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని గుర్తు చేశారు. ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ కె యాదగిరి, జిల్లా నాయకులు బండలయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.