12-09-2025 12:00:00 AM
- సింగరేణి డైరెక్టర్ (పిపి) వెంకటేశ్వర్లు
మందమర్రి, సెప్టెంబర్ 11 : సింగరేణి ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు కోరారు. గురు వారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో ఉత్పాదకతపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. అనంతరం ఏరియాలోని కేకే ఓసీపీ, పిఓబి ప్లాంటును సందర్శించారు. ఓసిపిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, కెకె ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, గని మేనేజర్ రామరాజు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, ఏరియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.