calender_icon.png 20 June, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలువు దోపిడీ చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

19-06-2025 12:00:00 AM

  1. పాఠశాలలోనే యదేచ్చగా పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు

కార్పొరేట్ దోపిడీకి అండగా విద్యాశాఖ అధికారులు

బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, జూన్ 18 ( విజయక్రాంతి ) : చదువుల పేరుతో అ మాయక ప్రజలను నిలువు దో పిడీ చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డి మాండ్ చేశారు.బుధవారం జి ల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలను బిసి పొలిటికల్ జేఏసీ నాయకులతో కలిసి సందర్శించారు.

లక్షలు వసూలు చేస్తున్న ఫీజుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసు కున్నారు. పాఠశాలలోనే పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, టై బెల్టులు అమ్ముతున్నారని తెలిసి స్టోర్ రూమును సందర్శించగా.వాస్తవంగానే స్టోర్ రూములో స్కూల్ యూనిఫామ్, టై, బెల్టులు ఉండటాన్ని గుర్తించి జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... విద్యా వ్యవస్థను పటిష్టం చేసి, పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును అక్కున చేర్చడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే, మరో పక్క నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, మదనాపూర్ మం డల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు గుర్రం రాఘవేందర్, ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.