19-06-2025 06:52:36 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అక్రమంగా తన వ్యవసాయ భూమిలో రాత్రి సమయాలలో రాళ్లు పోస్తున్న ఈరమ్మ యాదగిరిపై చట్టా రీత్యా చర్యలు తీసుకోవాలని కనగల్ మండలం(Kanagal Mandal) రేగట్ట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఉడతల పార్వతమ్మ, యాదగిరిలు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రేగట్టే గ్రామ రెవెన్యూ చివర్లో సర్వేనెంబర్ 142, 158 సర్వే నెంబర్లలో నాకు వ్యవసాయ భూమి ఉన్నదని గత 1975 సంవత్సరాల నుండి సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నా ప్రక్కన పట్టా భూమి కలిగిన గుంటకాడి ఈదయ్య తన వ్యవసాయ భూమిని ఈరమ్మ యాదగిరికి విక్రయించడానికి నిర్ణయించుకున్నాడు.
వారి వ్యవసాయ భూమికి దారి లేకపోవడంతో నా పేరు మీద పట్టా భూమి కలిగి ఉన్న వ్యవసాయ భూమిలో దారికి కొంత భూమి ఇవ్వాలని కోరారు. దారికి మీరు ఇచ్చిన భూమికి సాయి రెడ్డి బావి వద్ద మీకు బదులు భూమి ఇస్తానని నమ్మబలికి తన వ్యవసాయ భూమిని యాదగిరికి విక్రయించాడు. కానీ మాకు ఎలాంటి భూమి ఇవ్వకుండా భూమి కొనుగోలు చేసిన యాదగిరి రాత్రి సమయాలలో తనకు వ్యవసాయ ట్రాక్టర్లు ఉండడంతో రాత్రి సమయాలలో పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చి మా వ్యవసాయ భూమిలో పోశారని తెలిపారు. ఎందుకు పోసారని మందలిస్తే వృద్ధులని చూడకుండా మాపై గొడ్డలితో దాడి చేయడానికి పూనుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు వెంటనే స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో అధికారులను వేడుకుంటున్నట్లు తెలిపారు.