28-06-2025 12:00:00 AM
చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనఖీ
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 27 (విజయకాంతి) విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎస్పి రోహిత్ రాజ్ హెచ్చరించారు. శుక్రవా రం చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మిక సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ ఇంద్రాసేనారెడ్డి,ఎస్త్స్ర శివరామకృష్ణ పాల్గొన్నారు.