calender_icon.png 27 June, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫస్టియర్‌లో 75 వేల అడ్మిషన్లు

27-06-2025 12:20:52 AM

విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో 75 వేల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారని, వీరు తప్పకుండా వార్షిక పరీక్షలకు హాజరయ్యేలా చూ డాలని అధికారులకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆదేశించారు.  ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో గురు వారం డీఐఈవోలు, ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రిన్సిపాళ్లు, డీఐఈవోలు కృషి చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్‌కు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామన్నారు.

రిపెయిర్లకు నిధులు..రాష్ట్రంలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో రిపేర్లకు సంబంధించిన నిధులను ఇంటర్ బోర్డు విడుదల చేసినట్లు తెలిసింది. దాదాపు 300కు పైగా కాలేజీలకు మొత్తం రూ.56.16 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం.